సింగరేణి జేఏ రాత పరీక్ష ఫలితాలు విడుదల
ABN , First Publish Date - 2022-09-11T09:04:15+05:30 IST
సింగరేణి జేఏ రాత పరీక్ష ఫలితాలు విడుదల
హైదరాబాద్, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): సింగరేణిలో 177 జూనియర్ అసిస్టెంట్(జేఏ) పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. జేఎన్టీయూహెచ్ డైరెక్టర్ విజయ్ కుమార్ రెడ్డి, సింగరేణి డైరెక్టర్ ఎస్.చంద్రశేఖర్ ఈ ఫలితాలను శనివారం విడుదల చేశారు. పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను సంస్థ అధికారిక వెబ్సైట్లో ఉంచామని వెల్లడించారు. రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో ఈ నెల 4న నిర్వహించిన రాత పరీక్షకు 77,898 మంది హాజరవ్వగా, ఇందులో 49,328 మంది అభ్యర్థులు అర్హత సాధించారని తెలిపారు. పరీక్షలో ఇచ్చిన ఓ మూడు ప్రశ్నలకు ఆప్షన్లలో సరైన సమాధానం లేనందున అభ్యర్థులందరికీ మూడు మార్కులు కలిపామని వెల్లడించారు. అర్హత సాధించిన అభ్యర్థుల రిజర్వేషన్, స్థానికత, మార్కులు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని వారం రోజుల్లోగా ప్రొవిజనల్ సెలక్షన్ జాబితాను విడుదల చేస్తామని సింగరేణి డైరెక్టర్ చంద్రశేఖర్ వెల్లడించారు.