అగ్రి, వెటర్నరీ, యూజీ కోర్సులకు కౌన్సెలింగ్
ABN , First Publish Date - 2022-11-22T03:57:36+05:30 IST
అగ్రి, వెటర్నరీ, యూజీ కోర్సులకు కౌన్సెలింగ్
హైదరాబాద్, రాజేంద్రనగర్, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ, వెటర్నరీ, ఉద్యాన అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు సోమవారం తొలి విడత సంయుక్త కౌన్సెలింగ్ను ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీలో రిజిస్ట్రార్ డా. ఎస్ సుధీర్కుమార్ ప్రారంభించారు. యూనివర్సిటీ ఆడిటోరియంలో నిర్వహిస్తున్న కౌన్సెలింగ్లో వెటర్నరీ విశ్వవిద్యాలయం రిజిస్ర్టార్ డాక్టర్ ఎస్టీ వీరోజీరావు, వ్యవసాయ విశ్వవిద్యాలయండీన్ డా.సీమ, పరీక్షల నియంత్రణాధికారి డా.శ్రవణ్, ఉద్యాన విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొని విద్యార్థులకు ప్రవేశపత్రాలు అందజేశారు.