ఢిల్లీకి గవర్నర్ తమిళిసై
ABN , First Publish Date - 2022-04-06T03:30:16+05:30 IST
తెలంగాణ గవర్నర్ తమిళిసై ఢిల్లికి బయలు దేరి వెళ్లారు. సోమవారం వెళ్లాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల ...
హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై ఢిల్లికి బయలు దేరి వెళ్లారు. సోమవారం వెళ్లాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల అప్పుడు రద్దు అయింది. తాజాగా మరోసారి తమిళిసై ఢిల్లీ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ మేరకు ఆమె హస్తినకు వెళ్లారు. కేంద్రమంత్రి అమిత్ షాతో తమిళిసై బుధవారం భేటీ కానున్నారు. ఇటీవల తెలంగాణలో జరిగిన పరిణామాలను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. దీంతో తమిళిసై ఢిల్లీ పర్యటన తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది.