తెలంగాణలో పెరుగుతోన్న కరోనా కేసులు
ABN , First Publish Date - 2022-01-12T00:55:09+05:30 IST
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. వైద్య సిబ్బందినీ కూడా కరోనా మహమ్మారి వదలడం లేదు. గాంధీ ఆస్పత్రిలో 44 మందికి కరోనా నిర్ధారణ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు.
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. వైద్య సిబ్బందినీ కూడా కరోనా మహమ్మారి వదలడం లేదు. గాంధీ ఆస్పత్రిలో 44 మందికి కరోనా నిర్ధారణ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. 20 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు, 10 మంది హౌస్సర్జన్స్, 10 మంది పీజీ విద్యార్థులు, నలుగురు టీచర్లకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారించారు. అలాగే ఉస్మానియా ఆస్పత్రిలో 27 మందికి, నీలోఫర్లో ఇద్దరు, ఈఎన్టీలో ఏడుగురికి కరోనా నిర్ధారించారు. కాకతీయ మెడికల్ కాలేజీలో 27 మంది మెడికోలకు కరోనా వైరస్ సోకింది.