బండి సంజయ్కు తరుణ్ చుగ్ ఫోన్
ABN , First Publish Date - 2022-04-18T21:10:48+05:30 IST
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు ఆ పార్టీ రాష్ట్ర వ్యహారాల ఇన్చార్జ్ తరుణ్ చుగ్ సోమవారం ఫోన్ చేశారు
హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు ఆ పార్టీ రాష్ట్ర వ్యహారాల ఇన్చార్జ్ తరుణ్ చుగ్ సోమవారం ఫోన్ చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తలు ‘ప్రజా సంగ్రామ యాత్ర’పై ఈరోజు దాడి చేయడంపై ఆరా తీశారు. అధికార టీఆర్ఎస్ కార్యకర్తలు పాదయాత్రను అడ్డుకున్న విషయం తెలిపారు. ముందస్తు ప్లాన్ ప్రకారమే దాడి చేశారన్నారు. జాతీయ నాయకత్వం అండగా ఉంటోంది.. ధైర్యంగా ముందుకెళ్లమని సంజయ్కు తరుణ్ చుగ్ చెప్పారు.