మహిళల్ని ఆర్థికంగా బలోపేతం చేయడమే ‘శ్రీనిధి’ లక్ష్యం
ABN , First Publish Date - 2022-07-09T20:28:22+05:30 IST
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళల సమగ్ర అభివృద్ధికి అనేక కార్యక్రమాలను చేపట్టి అమలు చేస్తున్నదని,అందులో భాగంగానే మహిళలను ఆర్ధికంగా బలోపేతం చేయడం, మహిళా సాధికారతే లక్ష్యంగా ‘శ్రీనిధి’ సంస్ధ పనిచేస్తున్నదని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొన్నది.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళల సమగ్ర అభివృద్ధికి అనేక కార్యక్రమాలను చేపట్టి అమలు చేస్తున్నదని,అందులో భాగంగానే మహిళలను ఆర్ధికంగా బలోపేతం చేయడం, మహిళా సాధికారతే లక్ష్యంగా ‘శ్రీనిధి’ సంస్ధ పనిచేస్తున్నదని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొన్నది.మహిళా సంఘాల సభ్యులందరికీ జీవనోపాదుల ద్వారా ఆదాయం పెంపొందించడం, అన్ని రకాల అవసరాలకు సత్వర రుణం పొందుటకు సత్వర రుణ సహకారం ఇవ్వడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం శ్రీనిధి సంస్థను స్థాపించిందని వెల్లడించింది.శ్రీనిధి సంస్థలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 56 లక్షల మంది సభ్యులు ఉన్నారు 5 లక్షల 50 వేల సంఘాలు, 22 వేల 300 గ్రామ సమాఖ్యలు, 629 మండల పట్టణ సమాఖ్యలు భాగస్వామ్యం ఉన్న ఏకైక సంస్థ శ్రీనిధి. మన రాష్ట్రంలో శ్రీనిధి సంఘాలను చూసి బీహార్ రాష్ట్ర ప్రభుత్వం శ్రీనిధి లాంటి సంస్థను తమ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
శ్రీనిధిప్రత్యేకలు
మన దేశంలో ఈ విధమైన సంస్థ ఎక్కడా లేదు. మహిళల ఆత్మగౌరవం పెంపొందించడానికి ఈ సంస్థ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించబడుతున్నాయి. మహిళలు తమ ఇంటి వద్ద ఉండి పని చేసుకునే విధంగా అతి తక్కువ వడ్డీకే (11.5 శాతం) రుణాలు శ్రీనిధి ద్వారా నేరుగా అందించబడుతోంది. పాడి పశువులు, కోళ్ళ పెంపకం, ఎలక్ట్రిక్ ఆటోలు, చిన్న చిన్న షాపులకు తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్నది. ఒక్కో మహిళకు తమ ఇంటి వద్ద ఉండి పని చేసుకొనే విధంగా 5 వేల రూపాయల నుండి 3 లక్షల రూపాయల వరకు రుణాలు అందించబడుతున్నాయి.
మహిళల నుండి తీసుకునే వడ్డీ బ్యాంకులు వసూలు చేసే వడ్డీ కన్నా3 శాతం తక్కువ. శ్రీనిధిలో అప్పు పొందేందుకు ఏవిధమైన ఖర్చులు, సేవా రుసుములు ఉండవు. వడ్డీ మార్టిన్, శ్రీనిధి పొందుపులపై ఇచ్చే వడ్డీ వల్ల శ్రీనిధి నుండి వచ్చేడివిడెండ్ వల్ల మహిళా సమైక్య సంఘాలు లబ్ధి పొందుతున్నాయి. గత ఎనిమిదేళ్ళ కాలంలో శ్రీనిధి ద్వారా 14,756 కోట్ల 85 లక్షల రూపాయలను మహిళా సంఘాల సభ్యులకు రుణంగా అందించడం జరిగింది. కిరాణం, లాండ్రీ, మొబైల్ ఫోన్ రిపేరింగ్, పౌల్ట్రీ, బేకరీ షాప్, గాజుల దుకాణం, సెలూన్, బ్యూటీ పార్లర్, ఇటుకల తయారీ, ఫోటో స్టూడియో, కార్పెంటరీ, సెంట్రింగ్, ఇంటర్నెట్, పాడి పరిశ్రమ, డెకరేషన్ అండ్ లైటింగ్ సర్వీస్, ఫ్యాన్సీ స్టోర్స్, చేపల అమ్మకం, పేపర్ ప్లేట్లు తయారీ, గొర్రెల పెంపకం, టైలరింగ్ షాపు, కూరగాయల అమ్మకం, వెల్డింగ్, జిరాక్స్ లాంటి 65 రకాల యూనిట్లు ప్రారంభించడానికి మహిళా స్వయం సహాయక సంఘాలకు రుణాలను అందించడం జరిగింది.
2022-23 సంవత్సరానికి శ్రీనిది వార్షిక ప్రణాళిక
2022-23 ఆర్ధిక సంవత్సరంలో 3700 కోట్ల రూపాయలను శ్రీనిధి ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాలకు రుణంగా అందించాలని లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించింది. గత సంవత్సరం కన్నాఈ సంవత్సరం 626 కోట్ల రూపాయలు అధికంగా రుణాలను ఇచ్చిసంఘాలను బలోపేతం చేయనున్నారు.2021-2022 ఆర్థిక సంవత్సరంలో 750 కోట్ల రూపాయలను ఎస్సీ ఉప ప్రణాళిక క్రింద & 410 కోట్ల రూపాయలును ఎస్టీ ఉప ప్రణాళిక క్రింద, శ్రీనిధి ఉపప్రణాళిక క్రింద 40 కోట్ల 4 లక్షల రూపాయలను వర్గాల ప్రత్యేక ప్రణాళిక కింద కేటాయించడం జరిగింది. డైరీ, పౌల్ట్రీ యూనిట్ల ఏర్పాటకు, ఎలక్ట్రిక్ ఆటోలకు, ఫుడ్ ప్రొసెడిరగ్ యూనిట్లు, గ్రీన్ హౌజ్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ల ఏర్పాట్లకు, ద్విచక్ర వాహణాల రిపేర్లకు, జనరల్ మెడికల్ స్టోర్స్, సోలార్ యూనిట్ల ఏర్పాట్లకు ఈ ఆర్థిక సహాయం అందించబడుతుంది.
పట్టణ ప్రాతంలో ఉన్న వీధి వ్యాపారుల స్వయం ఉపాధి కోసం రుణం ఇవ్వడానికి ఏర్పాటు చేయడం జరిగింది. 2014-15 నుండి 2019-20 వరకు 2,020 కోట్ల 47 లక్షల రూపాయలను శ్రీనిధి లాభoగా పొందింది. శ్రీనిధి ద్వార సంఘ సభ్యుల సంక్షేమానికి వచ్చే లాభాలలో 45 శాతం సంఘాల సామార్ధ్యాన్ని పెంపొందించేందుకు, 2 శాతం స్కాలర్షిప్లుగా అందించబడుతున్నది.ఇంటర్మీడియట్ చదివే సంఘం సభ్యుల పిల్లలకు 2500 రూపాయలు స్కాలర్షిప్ అందించబడుతుంది. సురక్ష భీమా పథకం క్రింద స్త్రీనిధిలో రుణం పొందిన వారు వారి సంఘాల లబ్ధి పొందుతున్నాయి.సురక్ష పథకం క్రింద స్వయం సహాయక సభ్యులందరికీ ఒక లక్ష వరకు జీవిత భీమా పథకం అమలు చేయబడుతున్నది.