స్పీకర్‌ పోచారం, మంత్రి ఎర్రబెల్లికి ఊరట

ABN , First Publish Date - 2022-02-23T09:15:33+05:30 IST

కనీస మద్ధతు ధర అంశంపై ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో..

స్పీకర్‌ పోచారం, మంత్రి ఎర్రబెల్లికి ఊరట

2005 నాటి కేసులను కొట్టేసిన నాంపల్లి కోర్టు 


హైదరాబాద్‌, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి) : కనీస మద్ధతు ధర అంశంపై ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో నిరసనకు యత్నించిన తెలుగుదేశం పార్టీ నాయకులపై 2005లో నమోదైన కేసులను నాంపల్లి న్యాయస్థానం మంగళవారం కొట్టివేసింది. దీంతో అప్పటి టీడీపీ నేతలు, ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌  పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఈ కేసుల నుంచి విముక్తి పొందారు. వరంగల్‌లో 2005లో జరిగిన ఘటనకు సంబంధించి  పోచారం, ఎర్రబెల్లి, తూళ్ళ దేవేందర్‌గౌడ్‌, కడియం శ్రీహరి, వేణుగోపాలచారి, మండవ వెంకటేశ్వర్‌రావు, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, నాగ జనార్దన్‌రెడ్డి, సీహెచ్‌ సురే్‌షరెడ్డి, నరేందర్‌రెడ్డితోపాటు మరో ఏడుగురిపై నమోదైన కేసులను న్యాయస్థానం కొట్టేసింది. ఈ మేరకు నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు న్యాయమూర్తి జయకుమార్‌ మంగళవారం తీర్పు వెలువరించారు. కాగా తీర్పు నేపథ్యంలో నాటి టీడీపీ సహచరులంతా హాజరై ఒకరినొకరు పలకరించుకుని గ్రూప్‌ ఫొటో దిగారు.  

Updated Date - 2022-02-23T09:15:33+05:30 IST