ఏపీ ఎక్స్ప్రె్సలో పొగలు
ABN , First Publish Date - 2022-01-22T08:11:40+05:30 IST
విశాఖపట్నం నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఏపీ ఎక్స్ప్రెస్(20806) బోగీ
నెక్కొండ రైల్వేస్టేషన్లో నిలిపివేత
నెక్కొండ, జనవరి 21 : విశాఖపట్నం నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఏపీ ఎక్స్ప్రెస్(20806) బోగీ నుంచి శుక్రవారం ఒక్కసారిగా పొగలు వచ్చాయి. దీంతో వరంగల్ జిల్లా నెక్కొండ స్టేషన్లో రైలును నిలిపివేశారు. ప్రయాణికులు భయాందోళనతో ప్లాట్ఫాంపైకి పరుగులు తీశారు. ఏపీ ఎక్స్ప్రెస్ నెక్కొండకు చేరుకున్న సమయంలో స్టేషన్ మెయిన్ లైన్లో గూడ్స్ రైలు ఆగి ఉంది. దీంతో ఏపీ ఎక్ప్రె్సను లూప్లైన్ (రెండో ప్లాట్ఫామ్ ఉన్న లైన్)కు మళ్లించారు. రైలు వేగాన్ని తగ్గించేందుకు డ్రైవర్ బ్రేక్లు వేయడంతో రెండో బోగీ (ఎస్-6)లో బ్రేక్లు జామ్ అయి పొగలు వచ్చాయి. గుర్తించిన డ్రైవర్ రైలును ఆపాడు. మరమ్మతుల అనంతరం రైలును అరగంట ఆలస్యంగా పంపించారు. సాంకేతిక లోపం వల్ల బ్రేక్లు జామ్ అయి పొగలు వ్యాపించాయని అధికారులు చెప్పారు.