సింగరేణి ప్రైవేటీకరణ ఆటలు సాగనివ్వం: కొప్పుల
ABN , First Publish Date - 2022-01-25T07:40:45+05:30 IST
లాభాలతో నడుస్తున్న సింగరేణి జోలికొస్తే ఊరుకోబోమని మంత్రి
లాభాలతో నడుస్తున్న సింగరేణి జోలికొస్తే ఊరుకోబోమని మంత్రి కొప్పుల ఈశ్వర్ కేంద్రాన్ని హెచ్చరించారు. బీజేపీ ప్రభుత్వ ప్రయివేటీకరణ విధానాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు. లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న సింగరేణిని కేంద్రం అమ్మేయాలని కుట్ర చేస్తోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సింగరేణి కార్మికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాత సింగరేణి గణనీయమైన అభివృద్థి సాధించిందన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ప్రజల్లో ఎండగడతామని హెచ్చరించారు.