ఏడాదిగా బాలికపై లైంగిక దాడి

ABN , First Publish Date - 2022-07-01T09:04:46+05:30 IST

తండ్రి అనారోగ్యంతో మంచం పట్టాడు. ఆరోగ్యం సరిగా లేక మూడేళ్ల క్రితం అనారోగ్యంతో తల్లి కన్ను మూసింది.

ఏడాదిగా బాలికపై లైంగిక దాడి

  • బాధితురాలు ఎనిమిది నెలల గర్భవతి.. 
  • పనికి తీసుకువెళ్లి తాపీ మేస్త్రీ అఘాయిత్యం


రాజాపేట, జూన్‌ 30 : తండ్రి అనారోగ్యంతో మంచం పట్టాడు. ఆరోగ్యం సరిగా లేక మూడేళ్ల క్రితం అనారోగ్యంతో తల్లి కన్ను మూసింది. దీంతో ఆ బాలిక కుటుంబ పోషణ భారాన్ని నెత్తిన ఎత్తుకుంది. రోజు కూలీగా మారి ఓ మేస్త్రీ వద్ద తాపీ పనికి వెళుతోంది. ఈ క్రమంలో ఆమెపై కన్నేసిన కీచకుడు.. బాలికను బెదిరించి ఏడాదిగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. దీంతో ఆమె గర్భం దాల్చింది. ప్రస్తుతం బాలికకు ఎనిమిదో నెలగా గుర్తించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలో ఈ దారుణం జరిగింది. బాధితురాలి కుటుంబీకుల కథనం ప్రకారం... మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(17) ఆరో తరగతి వరకు చదువుకుంది. మూడేళ్ల క్రితం తల్లి మృతిచెందగా, తండ్రి అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యాడు. దీంతో తండ్రి, చెల్లెలిని పోషించేందుకు ఆ బాలిక.. మేస్త్రీ చింతిగారి నర్సింహులు(35)తో రెండేళ్లుగా తాపీ పనికి వెళుతోంది. ఈ క్రమంలో పని ప్రదేశంలో ఆమెను బెదిరించి నర్సింహులు ఏడాదిగా లైంగిక దాడి చేస్తున్నాడు. శరీరంలో మార్పులను గుర్తించిన కుటుంబసభ్యులు బాలికను నిలదీశారు. దీంతో ఆమె 8 నెలల గర్భవతి అని తెలిసింది. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - 2022-07-01T09:04:46+05:30 IST