పేదల ఇళ్లను అమ్ముకుంటారా?
ABN , First Publish Date - 2022-01-29T08:04:56+05:30 IST
పేదల కోసం కట్టించి ఇచ్చిన ఇళ్లను విక్రయించేందుకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం సిద్ధమవడం పట్ల వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు.
కేసీఆర్ తీరుపై షర్మిల మండిపాటు
హైదరాబాద్, జనవరి 28(ఆంధ్రజ్యోతి): పేదల కోసం కట్టించి ఇచ్చిన ఇళ్లను విక్రయించేందుకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం సిద్ధమవడం పట్ల వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే ఈ భూముల్లో ఎంతో మందికి డబుల్ బెడ్రూం ఇల్లు కట్టించి ఇవ్వొచ్చు. ‘పేదల ఆస్తులు అమ్ముకుని సొమ్ము చేసుకోవాలనుకుంటున్న చేతగాని ముఖ్యమంత్రి మనకొద్దు’ అంటూ ట్విటర్లో ఆమె పేర్కొన్నారు. మధ్య తరగతి ప్రజల కోసం రాజీవ్ స్వగృహ పథకాన్ని వైఎ్సఆర్ ప్రవేశ పెట్టారన్నారు.