పేదల ఇళ్లను అమ్ముకుంటారా?

ABN , First Publish Date - 2022-01-29T08:04:56+05:30 IST

పేదల కోసం కట్టించి ఇచ్చిన ఇళ్లను విక్రయించేందుకు సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం సిద్ధమవడం పట్ల వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మండిపడ్డారు.

పేదల ఇళ్లను అమ్ముకుంటారా?

కేసీఆర్‌ తీరుపై షర్మిల మండిపాటు

హైదరాబాద్‌, జనవరి 28(ఆంధ్రజ్యోతి): పేదల కోసం కట్టించి ఇచ్చిన ఇళ్లను విక్రయించేందుకు సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం సిద్ధమవడం పట్ల వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మండిపడ్డారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే ఈ భూముల్లో ఎంతో మందికి డబుల్‌ బెడ్‌రూం ఇల్లు కట్టించి ఇవ్వొచ్చు. ‘పేదల ఆస్తులు అమ్ముకుని సొమ్ము చేసుకోవాలనుకుంటున్న చేతగాని ముఖ్యమంత్రి మనకొద్దు’ అంటూ ట్విటర్‌లో ఆమె పేర్కొన్నారు. మధ్య తరగతి ప్రజల కోసం రాజీవ్‌ స్వగృహ పథకాన్ని వైఎ్‌సఆర్‌ ప్రవేశ పెట్టారన్నారు. 

Updated Date - 2022-01-29T08:04:56+05:30 IST