ఇసుక ఆదాయం రూ. 5072 కోట్లు :ఎండీసీ
ABN , First Publish Date - 2022-08-31T09:31:14+05:30 IST
రాష్ట్రవ్యాప్తంగా ఇసుక రీచ్ల ద్వారా గత ఎనిమిదేళ్లలో ప్రభుత్వం రూ. 5072 కోట్ల ఆదాయం ఆర్జించిందని తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎ్సఎండీసీ) తెలిపింది.
రాష్ట్రవ్యాప్తంగా ఇసుక రీచ్ల ద్వారా గత ఎనిమిదేళ్లలో ప్రభుత్వం రూ. 5072 కోట్ల ఆదాయం ఆర్జించిందని తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎ్సఎండీసీ) తెలిపింది. రాష్ట్రంలో 98 ఇసుక రీచ్లను నిర్వహిస్తున్నామని, త్వరలో గ్రానైట్ క్వారీ కార్యకలాపాలనూ ప్రారంభించనున్నామని మంగళవారం వెల్లడించింది. కరీంనగర్ జిల్లా శంకర్పట్నం మండలం, కొత్తగట్టులో డైమెన్షనల్ స్టోన్ గ్రానైట్ క్వారీల కోసం అన్ని అనుమతులను పొందామని, త్వరలో పనులు ప్రారంభించనున్నామని వివరించింది.