ప్రాసిక్యూషన్ జేడీగా సాంబశివారెడ్డి
ABN , First Publish Date - 2022-09-10T08:28:19+05:30 IST
హోంశాఖ పరిధిలో డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ విభాగం జాయింట్ డైరెక్టర్ (జేడీ)గా ఎస్.సాంబశివారెడ్డిని ప్రభుత్వం నియమిస్తూ ఆ శాఖ ముఖ్యకార్యదర్శి రవి గుప్తా ఉత్తర్వులు జారీచేశారు.
హైదరాబాద్, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): హోంశాఖ పరిధిలో డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ విభాగం జాయింట్ డైరెక్టర్ (జేడీ)గా ఎస్.సాంబశివారెడ్డిని ప్రభుత్వం నియమిస్తూ ఆ శాఖ ముఖ్యకార్యదర్శి రవి గుప్తా ఉత్తర్వులు జారీచేశారు. సాంబశివారెడ్డి ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టులో గ్రేడ్-1 అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేస్తున్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పదోన్నతి పొందిన ఆయన జేడీగా నియమితులయ్యారు. మరో ఇద్దరు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు వి.వెంకటేశ్వర్లు, డి.శ్రీవాణిలకు కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా పదోన్నతి కల్పించారు. నూతన జేడీ సాంబశివరావును డైరెక్టర్ వైజయంతి అభినందించారు.