TS News: కామారెడ్డిలో రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి
ABN , First Publish Date - 2022-07-25T21:05:59+05:30 IST
జిల్లాలో సదాశివనగర్ మండల కేంద్రంలోని ఎన్హెచ్44 రోడ్డుపై ట్రాక్టర్ను వెనుక నుంచి లారీ కొట్టింది.
కామారెడ్డి: జిల్లాలో సదాశివనగర్ మండల కేంద్రంలోని ఎన్హెచ్44 రోడ్డుపై ట్రాక్టర్ను వెనుక నుంచి లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో భర్త కొండయ్య (45) అక్కడికక్కడే మృతి చెందగా... భార్య విజయలక్ష్మి(34), కూతరు మౌనిక తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో ట్రాక్టర్లో ఆరుగురు ప్రయాణిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కామారెడ్డి గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్కు తరలించారు. ట్రాక్టర్ ఆర్మూర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.