కేసీఆర్ తో వరి కొనిపిస్తున్న ఘనత కాంగ్రెస్దే: రేవంత్
ABN , First Publish Date - 2022-04-17T00:31:08+05:30 IST
కేసీఆర్ మెడలు వంచి వరి కొనిపిస్తున్న ఘనత కాంగ్రెస్దేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్నారు.
హైదరాబాద్: కేసీఆర్ మెడలు వంచి వరి కొనిపిస్తున్న ఘనత కాంగ్రెస్దేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వరి వేయక నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.15 వేలు ఇవ్వాలి.. తక్కువధరకు ధాన్యం అమ్ముకున్న రైతులకు రూ.600 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.మిల్లర్లతో ప్రభుత్వం కుమ్మక్కై రూ.3 వేల కోట్ల కుంభకోణం చేసిందని ధ్వజమెత్తారు.ఎఫ్సీఐకి చెందిన బియ్యం మాయమయ్యాయన్నారు.కేసీఆర్ అధికార ఉన్మాదిగా మారి దోచుకుంటున్నారని మండిపడ్డారు.బియ్యం మాయమైన ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.మంత్రి పువ్వాడ అజయ్ నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు.అక్రమ కేసులతో కాంగ్రెస్ కార్యకర్తలను వేధిస్తున్నారన్నారు. నిజాంకు పట్టిన గతే కేసీఆర్కు పడుతుందని రేవంత్రెడ్డి అన్నారు.