ఎంతమంది పీకేలను తెచ్చుకున్నా కేసీఆర్ గెలవలేరు: రేవంత్రెడ్డి
ABN , First Publish Date - 2022-02-28T21:32:53+05:30 IST
ఎంతమంది ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్కిషోర్ లాంటి వ్యక్తులను ఎంత మందిని తెచ్చుకున్నా సీఎం కేసీఆర్ గెలవలేరని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తేల్చిచెప్పారు.
హైదరాబాద్: ఎంతమంది ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్కిషోర్ లాంటి వ్యక్తులను ఎంత మందిని తెచ్చుకున్నా సీఎం కేసీఆర్ గెలవలేరని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తేల్చిచెప్పారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ కుట్రలకు ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కేసీఆర్ కుట్రలను మేధావులు ఆలోచించాలని సూచించారు. రాష్ట్రం కోసం అనేకమంది తెలంగాణ బిడ్డలు అమరులయ్యారని తెలిపారు. కేసీఆర్ ఏపీ కాంట్రాక్టర్లతో కుమ్మక్కై వేలకోట్లు సంపాదించారని రేవంత్రెడ్డి ఆరోపించారు.