సంగారెడ్డి జిల్లాలో రియల్టర్ దారుణ హత్య
ABN , First Publish Date - 2022-01-30T01:53:58+05:30 IST
జిల్లాలోని రాయికోడ్ పీఎస్ పరిధిలో రియల్టర్ దారుణ

సంగారెడ్డి: జిల్లాలోని రాయికోడ్ పీఎస్ పరిధిలో రియల్టర్ దారుణ హత్యకు గురయ్యాడు. రియల్టర్ కడవత్ రాజుని చంపి తల, మొండెంను దుండగులు వేర్వేరుగా పడేశారు. రాయికోడ్ మండలంలోని కుకునూర్ దగ్గర మృతుడి తల, న్యాకల్ మండలం రాఘపూర్ దగ్గర మొండెంను పోలీసులు గుర్తించారు. ఈ ఘటనతో సంబంధమున్నదని భావిస్తున్న ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యకు భూవివాదమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నెల 24న బీడీఎల్ భానుర్ పీఎస్లో రాజు మిస్సింగ్ కేసు నమోదయింది. మృతి చెందిన వ్యక్తిన రామచంద్రపురం మండలం వెల్లిమలతండా వాసిగా గుర్తించారు. ఈ హత్య స్థానికంగా సంచలనం సృష్టించింది.