నల్గొండ జిల్లాలో విద్యార్థినులను కొరికిన ఎలుకలు
ABN , First Publish Date - 2022-04-18T23:31:23+05:30 IST
దామరచర్ల గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో ఎలుకలు కలకలం రేపాయి.
నల్గొండ: జిల్లాలోని దామరచర్ల గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో ఎలుకలు కలకలం రేపాయి. నిద్రపోతున్న ఐదుగురు విద్యార్థినుల కాలు, చేతి వేళ్లను ఎలుకలు కొరికాయి. గాయపడిన విద్యార్థులను స్ధానిక ఆస్పత్రికి తరలించారు. స్ధానిక ఆస్పత్రిలో విద్యార్థులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గిరిజన గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన మరువక ముందే మరో ఘటన జరగడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పాఠశాలలో తనిఖీలకు వచ్చిన DTDO, RCO అధికారులను ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నేతలు అడ్డుకున్నారు. పాఠశాల ప్రిన్సిపాల్ని తక్షణమే సస్పెండ్ చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు.