ధాన్యాన్ని వెంటనే కొనాలి: రాంరెడ్డి దామోదర్రెడ్డి
ABN , First Publish Date - 2022-04-12T23:51:18+05:30 IST
పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లను వెంటనే తగ్గించాలని, రైతులు పండించిన యాసంగి వరి ధాన్యాన్ని వెంటనే కొనాలని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి డిమాండ్ చేశారు.
సూర్యాపేట: పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లను వెంటనే తగ్గించాలని, రైతులు పండించిన యాసంగి వరి ధాన్యాన్ని వెంటనే కొనాలని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం తిరుమలగిరి మండల కేంద్రంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా దామోదర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్కు రైతులపై నిజమైన ప్రేమ ఉంటే వెంటనే ఐకెపీ, పీఏసీఎస్ సెంటర్లను ప్రారంభించి యాసంగి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు.కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతీ పేదవాడికి సంక్షేమ పథకాలు అందేవి, ప్రస్తుతం గులాబీ కండువా వేసుకున్న వారికే అందుతున్నాయని మండిపడ్డారు. ఇప్పటికైనా రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని రాంరెడ్డి దామోదర్రెడ్డి అన్నారు.