Rajnath singh: రెబల్‌స్టార్ కృష్టంరాజు కుటుంబసభ్యులను పరామర్శించిన రాజ్‌నాథ్‌సింగ్

ABN , First Publish Date - 2022-09-16T20:13:31+05:30 IST

ఇటీవల అనారోగ్యంతో మరణించిన దిగ్గజ నటుడు, మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు నివాసానికి కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కాసేపటి క్రితమే చేరుకున్నారు.

Rajnath singh: రెబల్‌స్టార్ కృష్టంరాజు కుటుంబసభ్యులను పరామర్శించిన రాజ్‌నాథ్‌సింగ్

హైదరాబాద్: ఇటీవల అనారోగ్యంతో మరణించిన దిగ్గజ నటుడు, మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు (Krishnam raju) నివాసానికి  కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath singh) కాసేపటి క్రితమే చేరుకున్నారు. ఈ సందర్భంగా కృష్టంరాజు భార్య, పిల్లులు, హీరో ప్రభాస్‌ (Prabhas)ను కేంద్రమంత్రి ఓదార్చారు. మధ్యాహ్నం 3 గంటలకు ఫిల్మ్‌నగర్‌లో జరిగే కృష్ణంరాజు సంస్మరణ సభలో రాజ్‌నాథ్ సింగ్ పాల్గొననున్నారు. సాయంత్రం 4:20 గంటలకు కేంద్రమంత్రి ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు. రాజ్‌నాథ్ వెంట కిషన్ రెడ్డి (Kishan reddy), లక్ష్మణ్ (Laxman), చింతల తదితరులు ఉన్నారు. 

Updated Date - 2022-09-16T20:13:31+05:30 IST