Rajagopal Reddy: రాజగోపాల్రెడ్డిపై రేవంత్ వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్
ABN , First Publish Date - 2022-08-06T21:37:05+05:30 IST
ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి (Rajagopal Reddy)పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి (Revanth Reddy) వ్యాఖ్యలకు బీజేపీ నేత బండి సంజయ్
హైదరాబాద్: ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి (Rajagopal Reddy)పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి (Revanth Reddy) వ్యాఖ్యలకు బీజేపీ నేత బండి సంజయ్ (Bandi Sanjay) కౌంటరిచ్చారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ డబ్బు, కాంట్రాక్టులిచ్చి చేర్చుకునే సంస్కృతి బీజేపీది కాదని చెప్పారు. డబ్బు, కాంట్రాక్టులిచ్చి చేర్చుకునే సంస్కృతి బీజేపీది కాదని సంజయ్ తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన రాజ్గోపాల్, దాసోజు ఎందుకు పార్టీ మారుతున్నారో అర్థం చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ నేత సోనియాను తిట్టినవారే ఇప్పుడు పీసీసీ చీఫ్ అయ్యారని, కేసీఆర్ భాషను ప్రజలు అసహ్యించుకుంటున్నారని సంజయ్ తెలిపారు.
త్వరలో బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నీచుడు, దుర్మార్గుడు, కమీనే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి నయవంచన చేసిన రాజగోపాల్రెడ్డిని మునుగోడు గడ్డపై పాతిపెట్టాలని, వచ్చే ఉప ఎన్నికలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శుక్రవారం రాత్రి మునుగోడు నియోజకవర్గంలోని చండూరులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగసభలో రాజగోపాల్రెడ్డిపై రేవంత్రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.