17న ప్రగతిభవన్ ఎదుట నిరసన దీక్ష: ఎమ్మెల్యే జగ్గారెడ్డి
ABN , First Publish Date - 2022-01-12T02:39:16+05:30 IST
17న ప్రగతిభవన్ ఎదుట నిరసన దీక్ష: ఎమ్మెల్యే జగ్గారెడ్డి
హైదరాబాద్: ఈ నెల 17న ప్రగతిభవన్ ఎదుట నిరసన దీక్ష చేస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఐదు ప్రధాన డిమాండ్లతో ప్రజా పోరాటం చేస్తామని ఎమ్మెల్యే జగ్గారెడ్డి వెల్లడించారు. ఎల్ఆర్ఎస్తో అన్ఆథరైజ్డ్ లేఔట్ ప్లాట్లను రెగ్యులర్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు లక్ష రుణమాఫీని ఒకే విడతలో చెల్లించాలని, రుణమాఫీని 4 కిస్తీలుగా చెల్లించడం వల్ల మిత్తికే సరిపోతుందని జగ్గారెడ్డి విమర్శించారు. నిరుద్యోగ భృతి, 57 ఏళ్లకు పెన్షన్ ఇవ్వడం లేదని, మహిళా గ్రూపులకు రుణాలే ఇవ్వడం లేదని జగ్గారెడ్డి మండిపడ్డారు. ఈ హామీలే కేసీఆర్ను రెండోసారి సీఎంను చేశాయని, కానీ ఆ హామీలు మాత్రం అమలు కావడం లేదని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.