TS News: కాంగ్రెస్ వస్తేనే అన్నివర్గాలకు న్యాయం: ప్రవీణ్రెడ్డి
ABN , First Publish Date - 2022-07-22T21:51:25+05:30 IST
కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే అన్నివర్గాలకు న్యాయం జరుగుతుందని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్రెడ్డి అన్నారు.
సిద్దిపేట: కాంగ్రెస్(Congress) అధికారంలోకి వస్తేనే అన్నివర్గాలకు న్యాయం జరుగుతుందని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్రెడ్డి(praveen reddy) అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణతో పాటు కేంద్రంలో కాంగ్రెస్ని బలోపేతం చేయడానికి ఈ పార్టీలో చేరానని చెప్పారు. టీఆర్ఎస్కి రెండుసార్లు అవకాశం ఇచ్చినా ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు. రైతులకు న్యాయం జరిగేలా వరంగల్ సభలో రాహుల్గాంధీ రైతు డిక్లరేషన్ ప్రకటించారని చెప్పారు.హుస్నాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరవేసేందుకు అందరితో కలిసి పని చేస్తానని ప్రవీణ్రెడ్డి తెలిపారు.