అరకోటి పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం మనదే:మంత్రులు

ABN , First Publish Date - 2022-08-31T09:32:46+05:30 IST

ఇది వరకే 40 లక్షల మందికి పెన్షన్లు అందుతుండగా, కొత్తగా మరో 10 లక్షల మందికి మంజూరుతో అరకోటి మందికి పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వ్యవసాయ శాఖ మంత్రి ఎస్‌. నిరంజన్‌రెడ్డి అన్నారు.

అరకోటి పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం మనదే:మంత్రులు

ఆత్మకూర్‌, వేల్పూర్‌, తాండూరు, ఆగస్టు 30 : ఇది వరకే 40 లక్షల మందికి పెన్షన్లు అందుతుండగా, కొత్తగా మరో 10 లక్షల మందికి మంజూరుతో అరకోటి మందికి పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వ్యవసాయ శాఖ మంత్రి ఎస్‌. నిరంజన్‌రెడ్డి అన్నారు. మంగళవారం పలు జిల్లాల్లో కొత్తగా మంజూరైన పెన్షన్‌ల మంజూరు పత్రాలను మంత్రులు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. వనపర్తి జిల్లా ఆత్మకూర్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి ఎస్‌. నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల అమలులో దేశానికే తెలంగాణ దిక్సూచిగా నిలిచిందని అన్నారు.  నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండలం అమీనాపూర్‌లో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. పింఛన్లు పంపిణీ చేయడంలో దేశంలోనే తెలంగాణ నెంబర్‌వన్‌ స్థానంలో ఉందని అన్నారు.  రాష్ట్రంలోని వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులకు సీఎం కేసీఆర్‌ శ్రీరామ రక్షగా నిలుస్తున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. వికారాబాద్‌ జిల్లా తాండూరులో పెన్షన్ల పంపిణీ అనంతరం ఆమె మాట్లాడారు.

Updated Date - 2022-08-31T09:32:46+05:30 IST