TS News: 10వ తేదీ నామినేషన్ వేస్తా: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

ABN , First Publish Date - 2022-10-08T00:42:24+05:30 IST

Nalgonda: మునుగోడు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మునుగోడు ప్రజల తీర్పుతో కేసీఆర్ పతనం మొదలవుతుందన్నారు. తాను 10వ తేదీన నామినేషన్ వేస్తున్నానని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ‘‘ఎనిమిదేళ్ళలో కేసీఆర్ కుటుంబం దోచుకున్న లక్షకోట్ల అవినీతి సొమ్మును బయటకు తెచ్చేంత వరకు నిద్రపోను.

TS News: 10వ తేదీ నామినేషన్ వేస్తా: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Nalgonda: మునుగోడు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మునుగోడు ప్రజల తీర్పుతో కేసీఆర్ పతనం మొదలవుతుందన్నారు. తాను 10వ తేదీన నామినేషన్ వేస్తున్నానని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ‘‘ఎనిమిదేళ్ళలో కేసీఆర్ కుటుంబం దోచుకున్న లక్షకోట్ల అవినీతి సొమ్మును బయటకు తెచ్చేంత వరకు నిద్రపోను. కేటీఆర్ కుటుంబమంతా జైలుకు పోయేందుకు సిద్ధంగా ఉండాలి. మద్యం కుంభకోణంలో కవిత పాత్ర రుజువైంది.  ఈ సారి చంచల్ గూడ లేక తీహార్ జైల్లో కవిత బతుకమ్మ ఆడుతారు. మునుగోడు ప్రజలు ఇచ్చే తీర్పు చరిత్రలో నిలిచి పోతోంది. కేసీఆర్ పతనం ఇక్కడే మొదలవుతుంది. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి నాకు పోటీనే కాదు. ప్రజల యుద్ధం కేసీఆర్ పైనే.’’ అని పేర్కొన్నారు. 

Updated Date - 2022-10-08T00:42:24+05:30 IST