నల్గొండ జిల్లాలో వివాదస్పదమైన పాల సంఘం చైర్మన్ ఎన్నిక
ABN , First Publish Date - 2022-07-06T04:06:05+05:30 IST
చిట్యాల మండలం వెలిమినేడులో పాల సంఘం చైర్మన్ ఎన్నిక వివాదాస్పదమైంది. చైర్మన్గా ఎన్నికయ్యామంటూ...
నల్గొండ: చిట్యాల మండలం వెలిమినేడులో పాల సంఘం చైర్మన్ ఎన్నిక వివాదాస్పదమైంది. చైర్మన్గా ఎన్నికయ్యామంటూ మాజీ ఎమ్మెల్యే వీరేశం వర్గీయులు సంబరాలు చేసుకున్నారు. అక్రమ పద్ధతి అంటూ ఎమ్మెల్యే లింగయ్య అనుచరుల ఆందోళనలకు దిగారు. వీరేశం అనుచరులు తన సంతకం ఫోర్జరీ చేశారని పోలీసులకు ఎన్నికల అధికారి ప్రభాకర్ శర్మ ఫిర్యాదు చేశారు. వీరేశం వర్గీయులు ఫోర్జరీ సంతకాలతో చీటింగ్ చేశారని పోలీసుల నిర్ధారించారు. వేముల వీరేశం వర్గానికి చెందిన 12 మందిపై కేసు నమోదు చేశారు. నూతన చైర్మన్గా లింగయ్య అనుచురుడు గడ్డం సూర్యప్రకాష్రెడ్డి ఎన్నికయ్యారు.