కరోనా టెస్టు చేయిస్తానని వృద్ధురాలిని ఎమ్మార్వో ఆఫీస్కు తీసుకెళ్లిన చీటర్
ABN , First Publish Date - 2022-02-19T17:55:39+05:30 IST
కట్టంగూరు మండలం కలిమేరలో దారుణం చోటు చేసుకుంది. కరోనా టెస్టు చేయిస్తానని ఎల్లమ్మ అనే వృద్ధురాలిని ఎమ్మార్వో ఆఫీస్కు తీసుకెళ్లి దుండగుడు ఘరానా
నల్గొండ: కట్టంగూరు మండలం కలిమేరలో దారుణం చోటు చేసుకుంది. కరోనా టెస్టు చేయిస్తానని ఎల్లమ్మ అనే వృద్ధురాలిని ఎమ్మార్వో ఆఫీస్కు తీసుకెళ్లి దుండగుడు ఘరానా మోసానికి పాల్పడ్డాడు. వృద్ధురాలి పేరిట ఉన్న ఎకరం 10 గుంటలు భూమిని తన పేరు మీద వీరయ్య రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అయితే..వృద్ధురాలి భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న చీటర్ వీరయ్యను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు.