మోడీ జిమ్ కోచ్ మనోడే!
ABN , First Publish Date - 2022-07-01T16:39:48+05:30 IST
మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన అథ్లెటిక్స్ కోచ్ గడప రాజేశ్కు అరుదైన అవకాశం దక్కింది. హైదరాబాద్లో జరగనున్న బీజేపీ
3 రోజుల కోసం మంచిర్యాల వాసి నియామకం
ఏసీసీ, జూన్ 30 : మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన అథ్లెటిక్స్ కోచ్ గడప రాజేశ్కు అరుదైన అవకాశం దక్కింది. హైదరాబాద్లో జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరవుతున్నారు. ఈ తరుణంలో నగరంలో మూడు రోజుల పాటు ఉండే మోదీకి త్రెడ్మిల్, జిమ్, సైక్లింగ్ ఇన్స్ట్రక్టర్గా రాజేశ్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర స్పోర్స్ట్ అథారిటీ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రాజేశ్ ప్రస్తుతం జింఖానా మైదానంలో అథ్లెటిక్ కోచ్గా వ్యవహరిస్తున్నారు.