శ్యామాప్రసాద్ నిజమైన వారసుడు మోదీ: బండి
ABN , First Publish Date - 2022-07-07T09:48:54+05:30 IST
జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ నిజమైన వారసుడు ప్రధాని నరేంద్ర మోదీ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు.
హైదరాబాద్, జూలై 6 (ఆంధ్రజ్యోతి): జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ నిజమైన వారసుడు ప్రధాని నరేంద్ర మోదీ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఆర్టికల్ 370, పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వంటి నిర్ణయాలు అందులో భాగమేనని పేర్కొన్నారు. శ్యామాప్రసాద్ ముఖర్జీ జయంతిని పురస్కరించుకుని బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ.. నమ్మిన సిద్ధాంతం, దేశ ఐక్యత కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు పలువురు పాల్గొన్నారు.
గాడి తప్పిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ: ఎన్వీఎ్సఎస్
రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందని, పరిస్థితి రోజు రోజుకూ దిగజారుతోందని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎ్సఎస్ ప్రభాకర్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. అప్పు చేసి పప్పుకూడు అన్నట్లుగా పాలన తయారైందని విమర్శించారు. కమీషన్ల కోసం కార్పొరేషన్ల ద్వారా రుణాలు తీసుకుంటున్నారని ఆరోపించారు.