రాజగోపాల్రెడ్డితో మాట్లాడను: భట్టి విక్రమార్క
ABN , First Publish Date - 2022-07-26T00:34:09+05:30 IST
రాజగోపాల్రెడ్డితో మాట్లాడను: భట్టి విక్రమార్క
హైదరాబాద్: ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డిది కాంగ్రెస్ కుటుంబమని కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క అన్నారు. రాజగోపాల్ తమ ఎమ్మెల్యే కాబట్టే మాట్లాడడానికి వచ్చానన్నారు. పదవులు చాలా మంది కోరుకున్నా కొందరికే దక్కుతాయన్నారు. రాష్ట్ర ప్రజల లక్ష్యాల కోసం పనిచేద్దామని రాజగోపాల్తో చెప్పానని తెలిపారు. కేసీఆర్పై సీరియస్గా పోరాడుదామని రాజగోపాల్ అన్నారని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు.