సీఎస్పై ఎమ్మెల్యే రఘునందన్రావు ఫైర్
ABN , First Publish Date - 2022-03-11T23:22:22+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్పై బీజేపీ ఎమ్మెల్యే
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్పై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాల సస్పెన్షన్ కేసులో హైకోర్ట్ ఆర్డర్ కాపీలను తమకు ఇవ్వాలన్నారు. సుప్రీంకోర్టుకు వెళ్లకూడదనే ఆర్డర్ కాపీలు ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. సస్పెన్షన్ ఎందుకు చేశారో లిఖితపూర్వకంగా చెప్పాలంటే అసెంబ్లీ సెక్రెటరీ స్పందించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎస్ సోమేష్కుమార్పై 465 కోర్టు ధిక్కరణ కేసులున్నాయన్నారు. సీఎస్పై పీఎంవోతో పాటు జీవోపీటీకి ఫిర్యాదు చేశానని ఆయన పేర్కొన్నారు.