బీజేపీ నేత రామచంద్రరావుపై ఎమ్మెల్యే మైనంపల్లి ఫైర్
ABN , First Publish Date - 2022-03-16T22:28:52+05:30 IST
బీజేపీ నేత రామచంద్రరావుపై ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తీవ్రస్థాయిలో
హైదరాబాద్: బీజేపీ నేత రామచంద్రరావుపై ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అభివృద్ధిని అడ్డుకుంటూ స్థానికులను రామచంద్రరావు రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించారు. కబ్జాలు చేసిన వారికి సహకరిస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలపై చర్చించేందుకు ప్రజాదర్భార్ నిర్వహిస్తున్నామన్నాని ఆయన పేర్కొన్నారు. తాను తప్పు చేసినట్టు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆయన సవాల్ విసిరారు.