23న బయ్యారంలో ఉక్కు దీక్ష
ABN , First Publish Date - 2022-02-23T00:23:21+05:30 IST
బయ్యారంలో 23న జరిగే ఉక్కు దీక్షను జయప్రదం చేయాలని ఇల్లందు ఎమ్మెల్యే
మహబూబాబాద్: బయ్యారంలో 23న జరిగే ఉక్కు దీక్షను జయప్రదం చేయాలని ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ పిలుపునిచ్చారు. బయ్యారంలో హరిప్రియ ప్రెస్మీట్ నిర్వహించి మాట్లాడారు. విభజన చట్టంలో పొందుపరిచిన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యం కాదనడం హాస్యాస్పదమన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉక్కు కర్మాగారాన్ని నిర్మించాలని ఆమె డిమాండ్ చేశారు. రేపటి దీక్షలో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారని ఆమె తెలిపారు. ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించేవరకూ ఉద్యమిస్తామని కేంద్రాన్ని హరిప్రియ హెచ్చరించారు.