నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ మంత్రుల పర్యటన
ABN , First Publish Date - 2022-03-05T12:47:37+05:30 IST
నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రులు హరీష్రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ పర్యటించనున్నారు. ములుగు జిల్లాలో ఈ-హెల్త్ ప్రొఫైల్ పైలెట్ ప్రాజెక్ట్కు
వరంగల్: నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రులు హరీష్రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ పర్యటించనున్నారు. ములుగు జిల్లాలో ఈ-హెల్త్ ప్రొఫైల్ పైలెట్ ప్రాజెక్ట్కు మంత్రి హరీష్రావు శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం ములుగు జిల్లా ఆస్పత్రి నూతన భవనానికి శంకుస్థాపన చేసి.. ఏరియా హాస్పిటల్లో రేడియాలజీ ల్యాబ్, పీడియాట్రిక్ యూనిట్ను ప్రారంభించనున్నారు. నర్సంపేటలో 200, పరకాలలో 100 పడకల హాస్పిటల్కి మంత్రులు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం నర్సంపేట బహిరంగసభలో మంత్రులు హరీష్, ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్ పాల్గొననున్నారు.