దేశంలో బిజెపి శ్రేణులు దెయ్యాలుగా మారాయి: Gangula

ABN , First Publish Date - 2022-06-13T00:27:55+05:30 IST

దేశంలో బీజేపీ శ్రేణులు దెయ్యాలుగా మారాయని, వారిని రాళ్లతో కొట్టి పారదోలాలని బిసి, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(gangula kamalakar) అన్నారు.

దేశంలో బిజెపి శ్రేణులు దెయ్యాలుగా మారాయి: Gangula

కరీంనగర్: దేశంలో బీజేపీ శ్రేణులు దెయ్యాలుగా మారాయని, వారిని రాళ్లతో కొట్టి పారదోలాలని బిసి, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(gangula kamalakar) అన్నారు.వారికి ఇలాగే బుద్ది చెబుదామని ప్రతిన బునాలని పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా నుండి హజ్(huj)కు వెళ్లే యాత్రికుల వ్యాక్సినేషన్ కార్యక్రమాన్నిమంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవుడు ఉన్న చోట దెయ్యాలు ఉంటాయి.మీ యాత్రలో దేశంలోని దెయ్యాలని రాళ్లతో కొట్టాలని అన్నారు.


హిందూ, ముస్లింలు కలిసి ఉండాలని ప్రభుత్వం హజ్ కమిటీని ఏర్పాటు చేసిందన్నారు.రాక్షసులను చంపే శక్తి ఇవ్వాలని అల్లాను కోరుకొని రండి అంటూ పిలుపునిచ్చారు.ఒక వ్యక్తి వ్యాఖ్యల వల్ల దేశం ఇప్పుడు ప్రపంచం ముందు తలదించుకునే పరిస్థితి వచ్చిందన్నారు.మతాలను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేసే వారి పట్ల సంయమనం పాటించాలని మంత్రి గంగుల సూచించారు.

Updated Date - 2022-06-13T00:27:55+05:30 IST