Errabelli dayakar rao: గాంధీజీ హత్య కేసులో బీజేపీ పాత్ర ఉన్నట్లు అనుమానం
ABN , First Publish Date - 2022-09-16T19:50:19+05:30 IST
మహాత్మా గాంధీజీ హత్య కేసులో బీజేపీ పాత్ర ఉన్నట్లు అనుమానం ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
జనగామ: మహాత్మా గాంధీజీ హత్య కేసులో బీజేపీ (BJP) పాత్ర ఉన్నట్లు అనుమానం ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli dayakar rao) అన్నారు. పాలకుర్తి సభలో మంత్రి మాట్లాడుతూ... కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం (BJP government) దొంగ ప్రభుత్వమని వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సాయుధ పోరాటంలో, స్వాతంత్య్ర ఉద్యమంలో బీజేపీ పాత్రలేదని తెలిపారు. రాజకీయ లబ్ధి కోసమే తెలంగాణ విమోచన అంటున్నారని మండిపడ్డారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గడ్డ పాలకుర్తి అని చెప్పుకొచ్చారు. చాకలి ఐలమ్మ, బందగీ, దొడ్డి కొమురయ్య లాంటి వీరులు పుట్టిన నేల పాలకుర్తి అని అన్నారు. చావు అంచుల్లోకెళ్లి కేసీఆర్ (KCR) తెలంగాణ సాధించారన్నారు. సెక్రటేరియట్కు అంబేద్కర్ పేరు పెట్టిందుకు సీఎం కేసీఆర్ (CM KCR)కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Telangana minister) కృతజ్ఞతలు తెలియజేశారు.