రాష్ట్రంలో పడిపోతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు
ABN , First Publish Date - 2022-01-25T07:56:29+05:30 IST
రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. గడిచిన
హైదరాబాద్, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. గడిచిన రెండు, మూడు రోజుల క్రితం వరకు 16 డిగ్రీల నుంచి 20 డిగ్రీల మధ్య కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కాగా... సోమవారం తగ్గిపోయాయి. ఆదిలాబాద్లో అత్యల్పంగా 13.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత మెదక్లో 14.4, రామగుండంలో 15.4, నిజామాబాద్లో 16.2, హైదరాబాద్లో 16.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాగల మూడు రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని, ఎలాంటి వాతావరణ హెచ్చరికలు లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.