‘హైదరాబాద్ డ్రైనేజీ వ్యవస్థకు మించి భారీ వర్షాలు’
ABN , First Publish Date - 2022-07-23T21:20:14+05:30 IST
నగర డ్రైనేజీ వ్యవస్థకు మించి భారీ వర్షాలు కురిచాయని ఏబీఎన్ తో మాట్లాడిన జాతీయ విపత్తుల నివారణ సంస్థ మాజీ చైర్మన్ మర్రి శశిధర్రెడ్డి అన్నారు.
హైదరాబాద్: నగర డ్రైనేజీ వ్యవస్థకు మించి భారీ వర్షాలు కురిచాయని ఏబీఎన్ తో మాట్లాడిన జాతీయ విపత్తుల నివారణ సంస్థ మాజీ చైర్మన్ మర్రి శశిధర్రెడ్డి అన్నారు. డ్రైనేజీ సామర్థ్యం పెంచకపోవడం వల్లే వరదలని చెప్పారు. భవిష్యత్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. డబ్బు ఖర్చు లేకుండా తీసుకునే చర్యలు కూడా చేపట్టడం లేదని చెప్పారు. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమన్నారు. క్లౌడ్ బరస్ట్ చేయడం ఎవరికీ సాధ్యం కాదన్నారు. కాళేశ్వరంలో జరిపే పంపింగ్ ప్రపంచంలో ఎక్కడా జరగదని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అనాలోచిత చర్య అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.