సర్వేలు చూసుకుని Revanth కలలు కంటున్నాడు: Malla Reddy

ABN , First Publish Date - 2022-07-16T18:37:30+05:30 IST

మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్‌ నియోజికవర్గంలో మంత్రి కేటీఆర్(Minister KTR) పర్యటించారు. బహదూర్‌పల్లిలో ఒకేషనల్ కాలేజ్‌కు..

సర్వేలు చూసుకుని Revanth కలలు కంటున్నాడు: Malla Reddy

మేడ్చల్ : మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్‌ నియోజికవర్గంలో మంత్రి కేటీఆర్(Minister KTR) పర్యటించారు. బహదూర్‌పల్లిలో ఒకేషనల్ కాలేజ్‌కు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలను కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indra Reddy), మల్లారెడ్డి(Malla Reddy) పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) సర్వేలు చూసుకొని కలలు కంటున్నాడని విమర్శించారు. ఎంపీ అయి ఉండి కూడా రేవంత్ రెడ్డి ఏమి అభివృద్ధి చేయలేదన్నారు. ప్రజలకు కాంగ్రెస్, బీజేపీ చేసింది ఏమి లేదని విమర్శించారు. ప్రజలందరి మద్దతు టీఆర్ఎస్‌(TRS)కే ఉందని మల్లారెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2022-07-16T18:37:30+05:30 IST