TS NEWS: కేంద్రం, రాష్ట్రాన్ని దోచుకుంటున్న బీజేపీ, టీఆర్ఎస్: మహేష్ కుమార్ గౌడ్
ABN , First Publish Date - 2022-09-24T02:11:28+05:30 IST
దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు బీజేపీ, టీఆర్ఎస్(BJP, TRS)లు కేంద్రం, రాష్ట్రాన్ని దోచుకుంటున్నాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్..
హైదరాబాద్(Hyderabad): దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు బీజేపీ, టీఆర్ఎస్(BJP, TRS)లు కేంద్రం, రాష్ట్రాన్ని దోచుకుంటున్నాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రమంత్రి నిరంజన్ జ్యోతి(Niranjan Jyoti) వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కేసీఆర్(KCR) అవినీతిపై మాట్లాడుతుంది ఆయనను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో అధికారంలోకి వస్తేనే.. కేసీఆర్ను అరెస్ట్ చేస్తామనడం బీజేపీ చేతగానితనానికి నిదర్శనమన్నారు. ఈడీ , సీబీఐలు బీజేపీ చేతిలోనే ఉన్నాయన్నారు.‘‘మా పేపర్కు మేము డబ్బులు ఇస్తే.. ఈడీ నోటీసులు ఇస్తున్నారు.. అలాంటిది కేసీఆర్కు ఎటువంటి నోటీసులు ఎందుకు ఇవ్వడం లేదు’’ అని ప్రశ్నించారు. బీజేపీ, టీఆర్ఎస్లు గేమ్ ఆడుతున్నాయని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో బీజేపీకి వాటా ఉందన్నారు. అందుకే కేసీఆర్పై చర్యలు తీసుకునేందుకు బీజేపీ భయపడుతుందని దెప్పిపొడిశారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ అవినీతిపై వెంటనే చర్యలు తీసుకోవాలని మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు.