TS News: మహబూబాబాద్: కురవి మండలంలో దారుణం

ABN , First Publish Date - 2022-09-03T15:16:58+05:30 IST

మహబూబాబాద్ (Mahbubabad): కురవి మండలం నల్లెల్ల గ్రామంలో దారుణం జరిగింది.

TS News: మహబూబాబాద్: కురవి మండలంలో దారుణం

మహబూబాబాద్ (Mahbubabad): కురవి మండలం, నల్లెల్ల గ్రామంలో దారుణం జరిగింది. అనుమానస్పద స్థితిలో కొమిరే జంపయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనపై అదే గ్రామానికి చెందిన తోట నరేష్‌పై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జంపయ్య భార్యతో నరేష్ కొంతకాలంగా అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. దీంతో జంపయ్య మృత దేహంతో నరేష్ ఇంటి ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు. తన భార్యకు విడాకులు ఇవ్వాలంటూ తనను తోట నరేష్ బెదిరించాడని జంపయ్య తన సోదరుడికి ఫోన్ ద్వారా తెలిపాడు. విడాకులు తీసుకోకుంటే తనను, తన పిల్లలను కూడా హత్య చేస్తానని బెదిరించాడని, ఇదే విషయమై నరేష్ పలు మార్లు పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టినట్లు చెప్పాడు. అయితే జంపయ్య తన భార్యకు విడాకులు ఇవ్వడానికి నిరాకరించడంతో నరేష్ హత్యకు పాల్పడ్డాడని జంపయ్య బంధువులు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2022-09-03T15:16:58+05:30 IST