మాదాపూర్ నోవాటెల్ హోటల్లో బస చేయనున్న మోదీ
ABN , First Publish Date - 2022-06-30T16:50:20+05:30 IST
దాపూర్ నోవాటెల్ హోటల్లో మూడు రోజుల పాటు ప్రధాని మోదీ బస చేయనున్నారు. ముందుగా రాజ్భవన్లో ప్రధాని బృందం బస చేయాలని భావించింది.
హైదరాబాద్ : మాదాపూర్ నోవాటెల్ హోటల్(Novatel Hotel)లో మూడు రోజుల పాటు ప్రధాని మోదీ(PM Modi) బస చేయనున్నారు. ముందుగా రాజ్భవన్(Rajbhavan)లో ప్రధాని బృందం బస చేయాలని భావించింది. భద్రతా కారణాల దృష్ట్యా నోవాటెల్లో బసకు ఎస్పీజీ(SPG) అనుమతిచ్చింది. 2, 3, 4 తేదీల్లో ప్రధాని నోవాటెల్ హోటల్లో ఉండనున్నారు. 3వ తేదీ సాయంత్రం ప్రధాని భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. హెచ్ఐసీసీ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలు విధించనున్నారు. HICC పరిసరాల్లో నేటి నుంచి జులై 3 వరకూ 144 సెక్షన్ విధించనున్నారు. HICCకి 5 కి.మీ. పరిధిలో నేటి నుంచి జులై 3 వరకు నో ఫ్లై జోన్ అమల్లో ఉంటుంది.
5 వేల మంది పోలీసులతో అధికారులు భద్రతా ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. జులై 4న ప్రధాని మోదీ భీమవరం వెళ్లనున్నారు.