ఈ పండ్లు ఎప్పుడైనా తిన్నారా.. ఒక్కసారి రుచి చూశారో..!
ABN , First Publish Date - 2022-06-10T16:58:13+05:30 IST
ఎరుపు, పసుపు రంగులో గుత్తులు గుత్తులుగా అమ్మకానికి రెడీగా ఉన్న
- లిచి.. మస్తు రుచి
- మార్కెట్లో జోరుగా అమ్మకాలు
హైదరాబాద్ సిటీ/చిలకలగూడ : ఎరుపు, పసుపు రంగులో గుత్తులు గుత్తులుగా అమ్మకానికి రెడీగా ఉన్న లిచి పండ్లు (litchi fruits) వాహనాలపై వెళుతున్న వారిని ఆకట్టుకుంటున్నాయి. నీటి శాతం అధికంగా కలిగిఉండి విటమిన్ సీ, పీచు పదార్థం, రోగనిరోధకశక్తి కలిగి ఉండి శరీరానికి మేలు చేస్తాయి. పైన తోలు తీస్తే తాటి ముంజలాగా నోటిలో వేసుకుంటే కరిగి పోయేలా తియ్యని రుచి కలిగి ఉంటుంది.
ప్యారడైజ్, సఫిల్గూడ రైల్వే గేట్, వాయుపురి తదితర ప్రాంతాలలో జోరుగా అమ్మకాలు కొనసాగుతున్నాయి. రాజేష్ యాదవ్ అనే పండ్ల వ్యాపారిని ‘ఆంధ్రజ్యోతి’ పలకరించగా వేసవి కాలంలో మాత్రమే వస్తాయని కోల్కతా నుంచి దిగుమతి అవుతాయని, ధర కేజీ రూ.200 ఉంటుందని తెలిపారు. సీజనల్ పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయని డాక్టర్లు సూచిస్తున్నారు.