కిడ్నాప్ ముఠాకు దేహశుద్ధి
ABN , First Publish Date - 2022-01-09T01:29:03+05:30 IST
పట్టణంలో ఓ వ్యక్తిని కిడ్నాప్ చేయడానికి వచ్చిన
మహబూబాబాద్: పట్టణంలో ఓ వ్యక్తిని కిడ్నాప్ చేయడానికి వచ్చిన కిడ్నాప్ ముఠాకు దేహశుద్ధి చేశారు. రాకేష్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసేందుకు ముగ్గురు వ్యక్తుల యత్నం చేశారు. అయితే నిందితులను స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనకు వ్యాపార విభేదాలే కారణమని బాధిత కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఈ సంఘటన పట్టణంలో సంచలనంగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.