పెట్రోల్, డీజిల్ వ్యాట్పై KCR commission తీసుకుంటున్నారు:TBjp Chief Bandi Sanjay
ABN , First Publish Date - 2022-05-15T18:09:33+05:30 IST
పెట్రోల్, డీజిల్ వ్యాట్పై KCR commission తీసుకుంటున్నారు:TBjp Chief Bandi Sanjay
Hyderabad: Jubilee Hillsలో పెద్దమ్మతల్లిని Telangana Bjp Chief Bandi Sanjay దర్శించుకున్నారు. పేదలకు ఉచిత విద్య, వైద్యం హామీకి కట్టుబడి ఉన్నామని బండి సంజయ్ మరోసారి స్పష్టం చేశారు. త్వరలో మూడోవిడత ప్రజా సంగ్రామయాత్ర చేపడతామని బండి సంజయ్ చెప్పారు. కేసీఆర్, కేటీఆర్ పగటి వేషగాళ్ళని, బీజేపీ అధికారంలోకి వస్తే పేదలకు ఇళ్లు, జాబ్ క్యాలెండర్ అందిస్తామని బండి సంజయ్ చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద లక్షల ఇళ్లు నిర్మిస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్ వ్యాట్పై కేసీఆర్ కమిషన్ తీసుకుంటున్నాడని (KCR takes commission on petrol, diesel VAT) బండి సంజయ్ ఆరోపించారు.
బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ పెద్దమ్మ దర్శనం చేసుకున్నాక పీజేఆర్ గర్తొచ్చారని, ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. గొప్ప దేవాలయం నిర్మించి పీజేఆర్ చరిత్రలో నిలిచిపోయారని గుర్తు చేసుకున్నారు. అమ్మవారి ఆశీర్వాదంతోనే ప్రజా సంగ్రామయాత్ర విజయవంతం అయిందని చెప్పారు. నికార్సైన తెలంగాణవాదులు అమిత్ షా సభను విజయవంతం చేశారని, ఆకుపచ్చ తెలంగాణ కోసమే ప్రజా సంగ్రామయాత్ర చేపట్టినట్లు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు.