కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క మాట నిలబెట్టుకోలేదు: షర్మిల
ABN , First Publish Date - 2022-04-16T02:40:35+05:30 IST
సీఎం కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క మాట నిలబెట్టుకోలేదని వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల దుయ్యబట్టారు. శుక్రవారం ఆమె మీడియాతో
భద్రాద్రి: సీఎం కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క మాట నిలబెట్టుకోలేదని వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల దుయ్యబట్టారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్ చేతిలో మోసపోని వర్గం లేదన్నారు. రాష్ట్రంలో వ్యవసాయం శాపంగా మారిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో బడి, గుడి కన్నా మద్యం షాపులు ఎక్కువయ్యాయని తప్పుబట్టారు. రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల తెలంగాణగా మార్చారని షర్మిల మండిపడ్డారు.