కేసీఆర్ కొత్త నాటకం ఆడుతున్నారు: రేవంత్రెడ్డి
ABN , First Publish Date - 2022-03-05T23:52:06+05:30 IST
సీఎం కేసీఆర్పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాలు తిరుగుతూ
హైదరాబాద్: సీఎం కేసీఆర్పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాలు తిరుగుతూ కేసీఆర్ కొత్త నాటకం ఆడుతున్నారని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ మొదట ఫ్రంట్ అన్నారని, ఇప్పుడు ఫ్రంట్ లేదంటూ మళ్లీ నాటకం ఆడుతున్నారని మండిపడ్డారు. దేశాన్ని బలోపేతం చేసేది కాంగ్రెస్ మాత్రమేనని రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీకి వ్యతిరేకం అని హేమంత్ సోరెన్తో అన్నారని, మరి బీజేపీ నేత సుబ్రమణ్య స్వామితో ఎందుకు భేటీ అయ్యారని రేవంత్రెడ్డి ప్రశ్నించారు.