రైతుబంధు నిధుల జారీకి Cm kcr ఆదేశం
ABN , First Publish Date - 2022-06-23T01:30:28+05:30 IST
ఈ వానాకాలం పంట పెట్టుబడికి రైతుబంధు(rytu bandhu) నిధులను విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్(kcr) నిర్ణయించారు.
హైదరాబాద్: ఈ వానాకాలం పంట పెట్టుబడికి రైతుబంధు(rytu bandhu) నిధులను విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్(kcr) నిర్ణయించారు. ఈనెల 28వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయాలని ముఖయమంత్రి కె.చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు.ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటి లాగానే వరుస క్రమంలో రైతుల ఖాతాలలో రైతుబంధు నిధులను ప్రభుత్వం జమచేయనుంది.