జూబ్లీహిల్స్ కారు ప్రమాదం కేసులో ఇద్దరు అరెస్ట్
ABN , First Publish Date - 2022-03-19T00:25:05+05:30 IST
జూబ్లీహిల్స్ కారుప్రమాదం కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మీర్జా, అతని కుమారుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్: జూబ్లీహిల్స్ కారు ప్రమాదం కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మీర్జా, అతని కుమారుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఓ కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు దాటుతున్న ముగ్గురు మహిళలను ఢీకొట్టింది. ఈ ఘటనలో రెండున్నర నెలల పసికందు మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన కారుపై బోధన్ ఎమ్మెల్యే షకీల్ పేరిట స్టిక్కర్ ఉంది. రాత్రి 10 గంటల సమయంలో దుర్గం చెరువు తీగల వంతెన వైపు నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-1 వైపు మహీంద్రా కారు వెళ్లింది. తిరిగి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-45లో వంతెన దిగి కొంతదూరం వచ్చిన తర్వాత రోడ్డు దాటుతున్న ముగ్గురు యాచక మహిళలను కారు ఢీకొట్టింది. ఓ మహిళ చేతిలో ఉన్న రెండున్నర నెలల బాబు కిందపడడంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. ముగ్గురు మహిళలకూ గాయాలయ్యాయి.