Nizamabadలో ఉగ్ర శిక్షణపై విచారణ వేగవంతం
ABN , First Publish Date - 2022-07-07T16:07:43+05:30 IST
నగరంలో వెలుగు చూసిన ఉగ్ర శిక్షణపై పోలీసులు విచారణను వేగవంతం చేశారు.

నిజామాబాద్: నగరంలో వెలుగు చూసిన ఉగ్ర శిక్షణ(Terrorist training )పై పోలీసులు(Police) విచారణను వేగవంతం చేశారు. ఆటోనగర్లోని శిక్షకుడు, పీఎఫ్ఐ (PFI) ప్రతినిధి అబ్దుల్ ఖాదర్తో పాటు అతనికి ఆర్థిక సహకారం అందించిన మరో ముగ్గురని అరెస్ట్ చేశారు. అబ్దుల్ ఖాదర్ ఇంటిపై శిక్షణ కోసం గదిని నిర్మించేందుకు రూ.6 లక్షలు ఇచ్చిన షేక్ షాదుల్లా, మహ్మద్ ఇమ్రాన్, మహ్మద్ అబ్దుల్ మొబిన్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రిమాండ్ అనంతరం నేడు మరోసారి పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. శిక్షణ పొందిన వారికోసం గాలింపు కొనసాగుతోంది.